Tuesday 8 November 2011

సంస్కృత సుభాషితం: తెలంగాణావాదం

సంస్కృతంలో చెప్పిన ఈ కింది శ్లోకం ఒకటి ఎప్పుడో చిన్నపుడు చదువుకొన్నాను కానీ నేటి తెలంగాణా వాదాని కి సరిగ్గా సరిపోతుంది అది:
దుర్బలస్య బలం రాజా బాలానాం రొదనం బలం |
బలం మూర్ఖస్య మౌనిత్వం చౌరాణాం అనృతం బలం ||

పైన చెప్పిన సుభాషితం మన తెలంగాణా వాదులకి సరిగ్గా సరిపోతుంది. ఎలాగంటే:

1.దుర్బలస్య బలం రాజా:
దుర్బలులకు రాజే బలాన్ని ఇస్తాడు అని అర్థం. ఈ తెలంగాణా వాదులు, వారికి ఏమీ కాదు అనుకొన్న సమయంలో గ్రామ సింహాలు కూడా ఏదో పెద్ద పులులం అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అదే వీరి తప్పుడు పనులకి పోలీసులు కనుక చర్యలు తీసుకొంటే వెంటనే వీరికి స్వయం ప్రతిపత్తి కలిగిన వీరికి తల్లిలాంటి మానవ హక్కుల సంఘం గుర్తుకు వచ్చి దాని చీర చెంగులో దాక్కొని తమ మీద పెట్టిన కేసులని తీయిన్చేసుకొనే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్లు మానసికంగా దుర్బలులు అందుచేతనే వేరే వారికి కంప్లెయింట్ చేస్తారు.అనగా ఈ దుర్బలులకి వారి తల్లి లాంటి మానవ హక్కుల సంఘం బలం.

2.బాలానాం రొదనం బలం:
చంటి పిల్లలకి నోరు ఉండదు. అందుచేత వారికి ఏది కావాల్సి వచ్చినా ఏడ్చి సాధిస్తారు. మన తెలంగాణా వాదులకి ఏడవడం బాగా వచ్చునని మన అందరికీ బాగా తెలిసినదే. అదే వీరి బలం. ప్రతీ దానికి ఏడుపే. ఎదుటివాడు సంపాదించాడు అని ఏడుపు. బాగుపదిపోయాడని ఏడుపు. ఈ ఉద్యమం పుట్టి ఆరు సంవత్సరాలు మాత్రమె అయ్యింది. ఆ విధంగా రకరకాలుగా ఏడ్చి తెలంగాణా కు అనుకూలంగా ఒక దొంగ ప్రకటన ప్రకటన ఇప్పించుకొన్నారు. కాబట్టి వీరికి ఈ బాలానాం రొదనం బలం అనే నానుడి సరిగ్గా సరిపోతుంది.

3.బలం మూర్ఖస్య మౌనిత్వం:
మూర్ఖుడితో వాదించడం కన్నామౌనంగా ఉండడమే బలం అని అర్థం. ఈ తెలంగాణా వాదులకి మూర్ఖత్వం కూడా ఎక్కువే. ఒక సారి అభివృద్ధి జరగలేదు అంటారు. అది కాక పొతే మీరు మా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు పదవులు అన్నీ దోచేసారని అంటారు. ఒకసారి ఆత్మ గౌరవం అంటారు. ఇంకొక సారి మమ్మల్ని మేము పరిపాలించుకొంటాం అంటారు. ఇంకొక సారి తెలంగాణా మా నాలుగో నలభయ్యో కోట్ల ప్రజల ఆకాంక్ష అంటారు. ఇవన్నీ అయిన ఆతరువాత మా తెలంగాణా మాకు కావాలి అని మూర్ఖవాదానికి దిగుతారు. ఆ మూర్ఖవాదానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. అందుచేత ఆ మూర్ఖ వాదం మొదలయినప్పుడు మనం మౌనం వహించడమే మన బలం. ఎందుకంటే వీళ్లు కొంత సేపు అరిచి గొంతు నొప్పి పుట్టి వాళ్ళే చల్లబడి ఊరుకొంటారు.

4.చౌరాణాం అనృతం బలం:
దొంగకి అబద్ధం చెప్పడమే బలం. మనం న్యాయమంగా చూస్తే ఈ తెలంగాణా వాదులు కోస్తా, రాయలసీమ వాసుల ఉద్యోగాలని తమ జనాభా యొక్క దామాషా కన్నా ఎక్కువగా అనుభవిస్తూ ఎదుటివారు తమని దోచుకోన్నారని ప్రచారం చేస్తారు. వీరి నాయకులు ఒకరు దొంగ సర్టిఫికేట్ లతో విదేశాలకి పోయే మహా నాయకుడు. ఒకరు ప్రజల ను బెదిరించి వారి సొమ్ములని దోచేసే మహా నాయకులు. మరొకరు హైదరాబాద్ నగరంలో ఖాళీ కనిపిస్తే చాలు తనవారితో గుడిసెలు వేయించిన మహానుభావుడు ఇప్పుడు కాటికి కాళ్లు చాపుకొన్న పర్స్తితిలో ఎదుటివారిని తప్పు పడతారు. ఒక ఆయన చేసేవన్నీ దొంగ దీక్షలే. అబద్ధాలే తప్ప ఏ రోజూ నిజం చెప్పనని ఒట్టు పెట్టుకొన్న పార్టీ కి నాయకుడు. ఒక ఎమ్మెల్యే గారు ఎదుటపడి దాడి చేయలేక దద్దమ్మలా తన గూండాని కారు డ్రయివర్ అని చెప్పి వెనక నుండి కొట్టించే ప్రబుద్ధుడు. ఇన్ని దొంగతనాలు దొంగ పనులూ చేసి తాము పాలలో స్నానం చేసామన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే చౌరాణాం అనృతం బలం నిజమనే కదా.

1 comment: